రైస్ ఏటీఎంతో బియ్యం పంపిణీ..

క‌రోనా లాక్‌డౌన్‌తో అందిరికీ తిండ క‌ష్టాలు ఏర్ప‌డ్డాయి. వాస్త‌వానికి దాత‌లు బియ్యం, పప్పులు ఇచ్చేందుకు రెఢీగా ఉన్నారు. కానీ సోష‌ల్ డిస్టాన్సింగ్ స‌మ‌స్య‌గా మారింది.  దాతలు ఇచ్చేవాటిని తీసుకునేందుకు జ‌నం ఒక్క‌ద‌గ్గ‌ర కూడితే అది మ‌రింత ప్ర‌మాద‌క‌ర‌మ‌వుతుంది. ఈ నేప‌థ్యంలో వియ‌త్నాంకు చెందిన నుయ‌న్ తువాన్ అన్ అనే వ్య‌క్తి ఓ వెరైటీ ఆలోచ‌న చేశాడు.  రైస్ డిస్పెన్స‌ర్‌ను అత‌ను క‌నుగొన్నాడు. దాన్నే రైస్ ఏటీఎం అని పిలుస్తున్నారు.  హో చి మిన్ సిటీలో దీన్ని ఏర్పాటు చేశారు.  ప్ర‌తి రోజూ 24 గంట‌లు.. ఎవ‌రు వ‌చ్చినా ఏటీఎం మెషిన్ నుంచి బియ్యం తీసుకోవ‌చ్చు.  ఓ యాప్ ద్వారా ఈ సిస్ట‌మ్‌ను కంట్రోల్ చేస్తున్నారు. ఒక్క‌రికి కిలోన్న‌ర బియ్యం ఇస్తున్నారు. ఒక‌వేళ ఒకే వ్య‌క్తి రెండ‌వ సారి వ‌స్తే, అత‌న్ని ప‌సిక‌ట్టే విధంగా యాప్‌ను రూపొందించారు. ఫ్రీ బియ్యాన్ని తీసుకునేందుకు జ‌నం రైస్ ఏటీఎంకు భారీ సంఖ్య‌లో వ‌స్తున్నారు.