రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా డాక్టర్ వైఎస్ఆర్ టెలీమెడిసిన్ కార్యక్రమాన్ని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. టెలీమెడిసిన్ విధానాన్ని పటిష్టంగా నడపాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా టెలీమెడిసిన్ టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి వైద్యుడితో మాట్లాడారు. టెలీమెడిసిన్ వైద్య సేవలను నిత్యం పర్యవేక్షించాలని, అవసరమైతే వైద్యుల సంఖ్యను పెంచాలన్నారు.
టెలీమెడిసిన్ కోసం టోల్ఫ్రీ నంబర్ 14410ను ప్రభుత్వం కేటాయించింది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు టెలీమెడిసిన్లో ఆరోగ్య సేవలు అందుబాటులో ఉంటాయి. ఓపీ సేవలు, ఔషధాల కోసం టెలిఫోన్ ద్వారా వైద్యులు సూచనలు, సలహాలు ఇస్తారు. 286 మంది వైద్యులు, 114 మంది ఎగ్జిక్యూటివ్స్ స్వచ్ఛందంగా సేవలు అందించేందుకు ముందుకొచ్చారు.